గ్రీవెన్స్‌లో వినతులు స్వీకరించిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌లో వినతులు స్వీకరించిన కలెక్టర్‌

May 27 2025 1:53 AM | Updated on May 27 2025 1:53 AM

గ్రీవ

గ్రీవెన్స్‌లో వినతులు స్వీకరించిన కలెక్టర్‌

నల్లగొండ: గ్రీవెన్స్‌ సందర్భంగా ప్రజావాణిలో కలెక్టర్‌ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారినుంచి వినతులు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులతో మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులన్నీ పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వినతులు స్వీకరించిన వారిలో అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ నారాయణ అమిత్‌, డీఆర్‌ఓ అశోక్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

మేము ఇళ్లు కట్టుకున్న భూమికి రైతు భరోసా పొందుతున్నారు

నల్లగొండ మండలం కాకుల కొండారంలో గ్రామ కంఠంలో కట్టుకున్న భూమికి వేరే వ్యక్తులు రైతు భరోసా పొందుతున్నారని, దాన్ని రద్దు చేసి తమ పేర్లు ఆన్‌లైన్‌లో వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు గ్రామస్తులు గ్రీవెన్స్‌లో విన్నవించారు. సర్వే నంబర్‌ 171 నుంచి 176 వరకు భూమిలో దోమలపల్లి ప్రభాకర్‌రావు తండ్రి నరసింహ పేరున రికార్డుల్లో చూపుతోందని తెలిపారు. ఈ సర్వే నంబర్లలో 200 గృహాలు ఉన్నాయని, ఆ సర్వే నంబర్లలో ఇళ్లు ఉన్నప్పటికీ రైతు భరోసా డబ్బులు పొందుతున్నారని వివరించారు. ఆ పట్టా రద్దు చేసి ఆ భూమిని గ్రామ కంఠం భూమిగా రెవెన్యూ రికార్డులో మార్పు చేయించాలని గ్రామానికి చెందిన గండిచెర్వు వెంకన్న, భిక్షమయ్య, ఉశయ్య, సైదులు, లవయ్యతోపాటు పలువురు మహిళలు విన్నవించారు.

గ్రీవెన్స్‌లో వినతులు స్వీకరించిన కలెక్టర్‌1
1/1

గ్రీవెన్స్‌లో వినతులు స్వీకరించిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement