తలలు పట్టుకుంటున్న బీఎల్‌ఓలు.. | - | Sakshi
Sakshi News home page

తలలు పట్టుకుంటున్న బీఎల్‌ఓలు..

Jul 27 2026 1:30 AM | Updated on Jul 27 2026 1:30 AM

క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలకు ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్‌ ఫారాలు పూర్తి స్థాయిలో అందక డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేయలేకపోతున్నారు. ఓవైపు నిర్ణీత గడువులోగా డిజిటలైషన్‌ ప్రక్రియ 100 శాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటం.. మరోవైపు టెక్నికల్‌ అధికారులుగా నియమించిన వారి నుంచి పూర్తి సహకారం అందకపోవడంతో బీఎల్‌ఓలు తలలు పట్టుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో డిజిటలైజేషన్‌ చేసుకున్న వారు సైతం ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేయాల్సి ఉండగా.. చాలా మంది ఇవ్వడం లేదని బీఎల్‌ఓలు పేర్కొంటున్నారు. ఎన్యూమరేషన్‌ ఫారం డిజిటలైషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తుండగా.. సాంకేతిక సమస్యతో ‘నో మ్యాపింగ్‌’ అని వస్తుండటంతో మరోసారి సరిచేయాల్సి రావడం తలనొప్పిగా మారింది. ఇంకా ఓటర్ల నుంచి 10 నుంచి 15శాతం ఎన్యూమరేషన్‌ ఫారాలు అందాల్సి ఉందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement