తాజాగా బీఆర్‌ఎస్‌ పోరుబాట.. | - | Sakshi
Sakshi News home page

తాజాగా బీఆర్‌ఎస్‌ పోరుబాట..

May 28 2026 12:52 AM | Updated on May 28 2026 12:52 AM

ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పీఆర్‌ఎల్‌ఐ పనులు పూర్తిచేయించేందుకు బీఆర్‌ఎస్‌ పోరుబాటకు సిద్ధమైంది. ఇటీవల జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమై జూన్‌లో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. తొలి రోజు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మధ్యలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొనేలా.. చివరకు ముగింపు రోజున కేసీఆర్‌ పాల్గొనేలా భారీ బహిరంగసభ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుండడంతో రాజకీయ సందడి నెలకొంది. మరోవైపు పాలమూరు ప్రాజెక్ట్‌ అస్త్రంగా తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా పోరు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఉమ్మడి జిల్లా రాజకీయాలను హీటెక్కించాయి.

Advertisement
 
Advertisement
Advertisement