స్థానికం.. సంస్థాగతం! | - | Sakshi
Sakshi News home page

స్థానికం.. సంస్థాగతం!

Dec 31 2025 8:38 AM | Updated on Dec 31 2025 8:38 AM

స్థానికం.. సంస్థాగతం!

స్థానికం.. సంస్థాగతం!

నాగర్‌కర్నూల్‌
పాలమూరులో కాంగ్రెస్‌కు కలిసొచ్చిన కాలం

బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

3 జిల్లాల్లో ‘ఢీ’సీసీ..

ఏడాది తొలి నుంచి డీసీసీ అధ్యక్షుల ఎంపిక కసరత్తు కొనసాగింది. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో ఏఐసీసీ పరిశీలకులు అభిప్రాయాలు సేకరించారు. అనంతరం నవంబర్‌ 22న ఐదు జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను ప్రకటించారు. నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిల్లాల్లో పాత నేతలు ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, ప్రశాంత్‌ కుమార్‌రెడ్డికి అవకాశం దక్కింది. మిగిలిన మూడు జిల్లాల్లోనూ డీసీసీ అధ్యక్షుల ఎంపిక చిచ్చు రేపింది. మహబూబ్‌నగర్‌లో సంజీవ్‌ ముదిరాజ్‌, వనపర్తిలో రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, గద్వాలలో రాజీవ్‌రెడ్డికి డీసీసీ పీఠం అప్పగించారు.

కాంగ్రెస్‌: పై‘చేయి’.. అయినా డీలా..

మూడు విడతలుగా డిసెంబర్‌ 11, 14, 17న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు అధిక సంఖ్యలో సర్పంచ్‌ పీఠాలను కై వసం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,678 సర్పంచ్‌ స్థానాలు ఉండగా.. ఏడు జీపీల్లో ఎన్నికలు జరగలేదు. మిగిలిన వాటిలో 964 మంది కాంగ్రెస్‌ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. వనపర్తి, కొల్లాపూర్‌, జడ్చ ర్ల నియోజకవర్గాల్లో అధికార పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నాయకుల్లో నిరాశ అలుముకుంది. జడ్చర్ల, దేవరకద్ర, వనపర్తి ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డికి తమతమ స్వగ్రామాల్లో ఎదురుదెబ్బ తగిలింది.

పల్లె పోరులో పై‘చేయి’.. సత్తా చాటిన బీఆర్‌ఎస్‌

గతంతో పోలిస్తే పలు చోట్ల పుంజుకున్న బీజేపీ

‘హస్తం’లో చిచ్చు రేపిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక

ఉమ్మడి జిల్లాలో 10సార్లు పర్యటించిన సీఎం రేవంత్‌

వాకిటికి అమాత్య యోగం.. ముదిరాజుల్లో హర్షం

పల్లె పోరులో పై‘చేయి’.. సత్తా చాటిన బీఆర్‌ఎస్‌

గతంతో పోలిస్తే పలు చోట్ల పుంజుకున్న బీజేపీ

‘హస్తం’లో చిచ్చు రేపిన డీసీసీ అధ్యక్షుల ఎంపిక

ఉమ్మడి జిల్లాలో 10సార్లు పర్యటించిన సీఎం రేవంత్‌

వాకిటికి అమాత్య యోగం.. ముదిరాజుల్లో హర్షం

గువ్వల బీజేపీకి జై.. బండ్లకు ఊరట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement