రాజీమార్గంలో కేసుల పరిష్కారం
నాగర్కర్నూల్ క్రైం: రాజీమార్గం ద్వారా లోక్ అదాలత్లో శాంతియుత వాతావరణంలో కక్షిదారులు తమ కేసులు రాజీ చేసుకోవచ్చని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టులో స్పెషల్ లోక్ అదాలత్తోపాటు విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ జిల్లాలోని కోర్టులలో నిర్వహించిన స్పెషల్ లోక్అదాలత్లో 200 కేసులు రాజీ అయ్యాయయని చెప్పారు. స్పెషల్ లోక్ అదాలత్లో రాజీ చేసుకోదగిన అన్ని క్రిమినల్, చెక్బౌన్స్, కుటుంబ, మోటారు వాహన యాక్సిడెంట్, భూ వివాదం, బ్యాంకు కేసులు పరిష్కరించుకున్నారని తెలిపారు. పోక్సో కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి నసీం సుల్తానా మాట్లాడుతూ లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలకు సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శృతిదూత, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి, ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాస్, ఆర్టీసీ మేనేజర్ యాదయ్య, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.


