ములుగు: యువత పొగాకు, గుట్కాలు, సిగరెట్లు, మద్యం తదితర మత్తు పానీయాలకు దూరంగా ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ సూచించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు ప్రతిరోజూ గంట పాటు వ్యాయామం చేయాలన్నారు. అలాగే ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్న్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్, సివిల్ సర్జన్ నరేశ్, డాక్టర్ దీపక్ తదితరులు పాల్గొన్నారు.
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్


