ప్రజావాణి, గిరివాణిలో వినతుల రాక
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరివాణి(గిరిజన దర్బార్)లో పలు సమస్యలపై ప్రజలు 92 దరఖాస్తులను అందజేశారు. ఇందులో ప్రజావాణిలో 32, గిరివాణిలో 60 అర్జీలను బాధితులు కలెక్టర్కు అందజేశారు. ఈ వినతులను స్వీకరించిన కలెక్టర్ దివాకర వాటిని పరిశీలించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీహెచ్. మహేందర్జీ, సంపత్రావు, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, ఆర్డీఓ వెంకటేశ్, డీడీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
స్వీకరించిన
కలెక్టర్ టీఎస్.దివాకర
పరిశీలించి వెంటనే
పరిష్కరించాలని ఆదేశాలు


