
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
ములుగు రూరల్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందని కలెక్టర్ టీఎస్ దివాకర అన్నారు. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ముందస్తుగా యోగా దినోత్సవాన్ని గిరిజన భవన్లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిత్య జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు యోగా తప్పనిసరిగా చేయాలన్నారు. మానవ జీవితంలో ఒత్తిడి తగ్గించుకునేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం మేనేజర్ చంద్ర, సంధ్య, యోగా ఇన్స్ట్రక్టర్ గురు శివకృష్ణ, హరిత, మానస, లయ, ప్రియాంక, గిరివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్ దివాకర