
కాళేశ్వరం బస్టాండ్లో షీ, మాతాశిశు కేంద్రం
కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం తాత్కాలిక బస్టాండ్లో షీ రూమ్ (సానిటరీ హైజిన్ ఎంపవర్మెంట్), మాతా శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పుష్కరాలకు కాళేశ్వరం వచ్చే మహిళలు, బాలింతల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన షీ, మాతా శిశు కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్శర్మ ఆదేశాల మేరకు శుక్రవారం కాళేశ్వరంలోని శాశ్వత బస్టాండ్కు మార్చినట్లు కాటారం సబ్కలెక్టర్ మయాంక్సింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం వచ్చే మహిళలకు బస్టాండ్లో షీ, మాతా శిశు కేంద్రం రూములు అందుబాటులో ఉంటాయని తెలిపారు. షీ రూమును, బ్రెస్ట్ ఫీడింగ్ కేంద్రాన్ని పాలిచ్చే తల్లులు వినియోగించుకోవాలని సూచించారు.