
యూనిఫాం అందజేత
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో నూతనంగా డిప్యూటేషన్పై వెళ్లిన మహిళా ఎస్అండ్పీసీ సిబ్బందికి శుక్రవారం ఏరియా ఇన్చార్జ్ జీఎం కవీంద్ర యూనిఫాంలు అందజేశారు. జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కవీంద్ర ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నూతనంగా విధుల్లో చేరుతున్న మహిళా ఉద్యోగులు ఎస్అండ్పీసీకి రావడం సంతోషకరమైన విషయమన్నారు. సింగరేణి ఉద్యోగంలో చేరే మహిళలు సంస్థలో అన్ని రకాల పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డాక్టర్ పద్మజ, మారుతి, మురళీమోహన్, మహిళా సెక్యూరిటీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.