
శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన సన్నధాన్యానికి క్వింటాకు బోనస్ రూ.500 ప్రకటించిన విషయం విధితమే. దీంతో యాసంగి సాగులో జిల్లాలో ఎక్కువశాతం రైతులు సన్నరకం ధాన్యం సాగు చేశారు. యాసంగి పంట అమ్మకాలు చేపట్టి నెలరోజులు గడుస్తున్నా.. సన్నధాన్యానికి బోనస్ అందక పోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించగా ప్రభుత్వం చెల్లించాల్సిన మ ద్దతు ధర రూ.2,320 చెల్లించింది. కానీ బోనస్ డబ్బులు రైతుల ఖాతాలో జమ కాలేదు. వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో పెట్టుబడి ఖర్చులకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
నెల రోజులు దాటినా..అందని డబ్బులు
● జిల్లాలో కొనుగోలు చేసిన సన్నధాన్యం 39,412.180 క్వింటాళ్లు
● రావాల్సిన బకాయి రూ.19.70 కోట్లు
● రైతులకు తప్పని ఎదురుచూపులు
త్వరగా చెల్లించాలి..
ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాకు రూ. 500 బోనస్ ప్రకటించడంతో నాలుగున్నర ఎకరాల్లో సాగు చేశా. సన్నరకం వరి సాగుకు పెట్టుబడి ఖర్చులు ఎక్కువ కాగా దిగుబడి మాత్రం తక్కువగా వచ్చింది. వరి ధాన్యం అమ్మి నెల రోజులు గడుస్తుంది. ప్రభుత్వం బోనస్ డబ్బులను త్వరగా చెల్లించాలి.
– ఇమ్మడి భిక్షపతి, రైతు ములుగు
బడ్జెట్ కేటాయించలేదు
బడ్జెట్ కేటాయించలేదు. రైతుల నుంచి సన్నధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఎంఎస్పీ డబ్బుల చెల్లింపులు జరిగాయి. జిల్లాలో సన్న ధాన్యం అమ్మకాలు చేపట్టిన రైతుల వివరాలు ఐఎఫ్ఎంఎస్ లాగిన్ నుంచి ప్రభుత్వానికి అందించాం. బడ్జెట్ కేటాయించిన వెంటనే బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి.
– ఫైజల్ హుస్సేన్, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి
●
రావాల్సిన బకాయిలు రూ.19.70 కోట్లు
జిల్లాలోని పది మండలాల్లో యాసంగి సాగులో సన్నధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం రూ.19.70 కోట్లు చెల్లించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 6,182 మంది రైతులు 39,412.180 క్వింటాల ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించారు.
న్యూస్రీల్

శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025

శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025

శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025

శనివారం శ్రీ 14 శ్రీ జూన్ శ్రీ 2025