
కొనసాగుతున్న రేషన్ పంపిణీ
ములుగు రూరల్: జిల్లాలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల మొదటి వారంలో లబ్ధిదారులకు పంపిణీని ప్రారంభించిన అధికారులు నిత్యం తనిఖీలు చేస్తూ అవకతవకలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభు త్వం ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించి నిరుపేదలకు అందిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేయడాన్ని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీలో 80శాతం మంది లబ్ధిదారులు అమ్మకాలు చేపట్టడంతో ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పట్టేది. కానీ సన్నబియ్యం పంపిణీతో నిరుపేదలకు సద్వినియోగం అవుతుంది.
జిల్లాలో 94,628 కార్డులు
జిల్లాలోని పది మండలాల్లో 94,628 రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతీ నెల జిల్లాలో 1,714 టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభంతో రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగా మూడు నెలల బియ్యాన్ని చౌకధరల దుకాణాలకు తరలించి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. జిల్లాలో మూడు నెలలకు గాను 5,157 టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. కాగా సన్నధాన్యానికి ప్రభుత్వం బోనస్ ఇస్తుండటంతో రైతులు అత్యధికంగా వరిసాగు చేస్తున్నారు.
మూడు నెలల సన్నబియ్యం ఒకేసారి అందజేత
జిల్లాలో 94,628 కార్డులు
తూకాల్లో అవకతవకలకు
పాల్పడితే చర్యలు
సివిల్ సప్లయీస్ అధికారి
ఫైజల్ హుస్సేన్