
మత్స్యకారులకు అండగా ఉంటాం..
ములుగు రూరల్: ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని గిరిజన భవన్లో యుఎల్టీ, నిర్మాణ్ సంస్థ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అందించిన తెప్పలు, వలలను కలెక్టర్ టీఎస్ దివాకరతో కలిసి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులకు అవసరమైన తెప్పలు, వలలు అందించడం అభినందనీయమన్నారు. ములుగు మండలంలోని జీవింతరావుపల్లిని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పైలట్ ప్రాజెక్టు గ్రామంగా ఎంపిక చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీరు
ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందిస్తామని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ది, సీ్త్ర శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ దనసరి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ క్లోరినేషన్ డౌసింగ్ సిస్టంను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారి సాంకేతికతతో ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ఇది ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్క