బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత

Nov 21 2024 1:09 AM | Updated on Nov 21 2024 1:09 AM

ములుగు : జిల్లా కేంద్రంలోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్సియల్‌ బాలికల పాఠశాలలో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారి శిరీష, ఎంపీడీఓ రామకృష్ణ హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు ప్రపంచ బాలల దినో త్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ రంగాల్లో నిలిచిన చిన్నారులు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా పురస్కారాలు అందుకోవడం జరుగుతుందన్నారు. బాలలు సమాజానికి అమూల్యమైన సంపద అని వారందరు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. బాల బాలికలు ఎలాంటి వివక్షకు గురికా కుండా బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వద్వర్యంలో రూపొందించిన బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీపీయు సోషల్‌ వర్కర్‌ జ్యోతి, ఓఆర్‌డబ్ల్యూ రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జిల్లా సంక్షేమ అధికారి శిరీష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement