‘మసూద, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ చిత్రాల ఫేమ్ తిరువీర్ హీరోగా, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓ..! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫొటోలో తిరువీర్, ఐశ్వర్యతో పాటు టీమ్ మొత్తం హ్యాపీ వైబ్లో కనిపించారు.
‘‘వినోదాత్మక చిత్రంగా రూపొందుతోన్న మూవీ ‘ఓ..! సుకుమారి’. ‘రజాకార్, పొలిమేర’ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన సీహెచ్ కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామేన్గా వ్యవహరించారు. భరత్ మంచిరాజు మంచి సంగీతం అందించారు. మా సినిమాని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.


