
టాలీవుడ్ లో చాలామంది సింగర్స్ ఉన్నారు. కానీ తనదైన శైలిలో పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్న గాయని హారిక నారాయణ్. సర్కారు వారి పాట, వారసుడు తదితర చిత్రాల్లో ఈమె పాడిన సాంగ్స్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. అలాంటిది ఇప్పుడు ఓ విషయమై వార్తల్లో నిలిచింది.
(ఇదీ చదవండి: నా వీడియో చూపించడం కరెక్ట్ కాదు: సింగర్ హారిక)
సినిమాలో పాటలు, సింగింగ్ షోలతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. గతేడాది మార్చిలో పృథ్వీనాధ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లది ప్రేమ వివాహం. అయితే పెళ్లికి రెండు వారాల ముందు నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పటివరకు తను ప్రేమలో ఉన్న విషయాన్ని బయటపడకుండా జాగ్రత్త పడింది.
హారిక నారాయణ్ పెళ్లికి కీరవాణి, రాఘవేంద్రరావు, యాంకర్ ప్రదీప్ తోపాటు చాలామంది సింగర్స్ హాజరయ్యారు. సరే అసలు విషయానికొస్తే.. తన ఇన్ స్టాలో పెళ్లి, ఎంగేజ్ మెంట్ ఫొటోల్ని హారిక నారాయణ్ డిలీట్ చేసింది. ఈమె అకౌంట్ లో భర్త పృథ్వీతో కలిసున్న ఫొటోలు కూడా లేవు.
(ఇదీ చదవండి: ప్రాణ భయం.. వేరే దేశంలో ఇల్లు కొన్న 'దేవర' విలన్)
మరోవైపు హారిక భర్త పృథ్వీ ఇన్ స్టాలోనూ పెళ్లి ఫొటోలు కనిపించట్లేదు. దీంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయా? అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. అయితే హారిక-పృథ్వీ ఒకరినొకరు మాత్రం ఇన్ స్టాలో ఫాలో అవుతున్నారు. మరేం జరిగిందో?
ఇకపోతే 'పాడుతా తీయగా' షో వల్ల తనకు అన్యాయం జరిగిందని ప్రవస్తి ఆరాధ్య అనే సింగర్ మీడియా ముందుకొచ్చింది. ఈమె కోసం జరుగుతున్న డిబేట్ లో తన వీడియో ఎందుకు ఉపయోగించారని హారిక నారాయణ్ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసింది.
(ఇదీ చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)