Sanjay Dutt :మహేశ్ బాబు సినిమాలో సంజయ్ దత్!
‘అతడు ’(2005), ‘ఖలేజా’ (2010) చిత్రాల తర్వాత హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటించనున్నారు. ఈ చిత్రంలో విలన్ పాత్రకు హిందీ నటుడు సంజయ్ దత్ను సంప్రదించాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఇప్పటికే యశ్ ‘కేజీఎఫ్: ఛాప్టర్ 2’లో సంజయ్ దత్ విలన్గా నటించిన విషయం తెలిసిందే. మరి... మహేశ్ వర్సెస్ సంజయ్ దత్ను చూస్తామా? అనే విషయం తెలియాలంటే వేచి చూడాలి.