‘వీరసింహారెడ్డి’ (2023) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ‘‘పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉంటుంది. మార్చిలో రెగ్యులర్ షూటింగ్ను ఆరంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.


