ఇటీవల బాక్సాఫీస్ వద్ద విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఇటీవల రిలీజైన టాక్సిక్ ఒక్క రోజుకే బాక్సాఫీస్ వద్ద కనిపించకుండా పోయింది. భారీ బడ్జెట్, తారాగణం ఉన్నప్పటికీ కంటెంట్ పరంగా మెప్పించలేకపోయింది. అలాంటి ఈ టైమ్లో ఇరుముడి సూపర్ టాక్తో దూసుకెళ్తోంది. అంతేకాకుండా మలయాళ చిన్న సినిమా బెత్లెహమ్ ఫ్యామిలీ యూనిట్ సైతం అదరగొడుతోంది.
ఇదిలా ఉంటే ఎప్పుడో 19 ఏళ్ల క్రితం వచ్చిన మూవీకి సీక్వెల్గా ఆవారాపన్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 2007లో ఇమ్రాన్ హష్మి, శ్రియా శరణ్ జంటగా ఆవారాపన్ డిజాస్టర్గా నిలిచింది. అయితే ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, దిశా పటానీ జంటగా కనిపించారు. ఈ చిత్రాన్ని నితిన్ కక్కర్ దర్శకత్వంలో తెరకెక్కించారు.
అప్పట్లో ఫ్లాప్ అయిన సినిమా సీక్వెల్కు ఇప్పుడు వసూళ్లు రావడంపై బాలీవుడ్లో చర్చ మొదలైంది. ఆగస్టు 14న విడుదలై ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు సాధించింది. ఈ మూవీ సూపర్హిట్గా నిలవడంపై ఇమ్రాన్ హష్మి ఎమోషనల్ అయ్యారు.


