
ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ 'పరదా' సినిమా సందర్భంగా హైదరాబాద్లో సందడి చేశారు. నగరంలోని ప్రసిద్ధ బల్కంపేట్ ఎల్లమ్మను అనుపమ దర్శించుకున్నారు. తను నటించిన కొత్త సినిమా ఆగష్టు 22న విడుదల కానుంది. దీంతో అమ్మవారి ఆశీస్సుల కోసం చిత్ర యూనిట్ వెళ్లింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆపై ఆలయంలో పూజలు నిర్వహించారు. తన సినిమా పరదా నుంచి 'యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః' సాంగ్ పోస్టర్ను అక్కడ ప్రదర్శించారు. అందుకు సంబంధించిన పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Team #Paradha visited Balakampet Yallamma Temple for the launch of #YatraNaryasthu Song and sought divine blessings 🙏✨
SECOND SINGLE OUT TODAY at 12 PM 🎼 pic.twitter.com/jYOENdHR8P— Ananda Media (@AnandaMediaOffl) July 17, 2025