Pavitra Lokesh: సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు పవిత్ర ఫిర్యాదు

Actress Pavitra Lokesh Complaint Cyber Crime - Sakshi

సినీ నటి పవిత్రా లోకేశ్‌ పోలీసులను ఆశ్రయించింది. సీనియర్‌ నటుడు నరేశ్‌, తన పట్ల కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని శనివారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఫొటోలు మార్ఫింగ్‌ చేసి, అభ్యంతరకర కామెంట్లతో వాటిని వైరల్‌ చేస్తున్నారని పేర్కొంది. తమ ఇద్దరినీ ట్రోల్‌ చేస్తూ వస్తున్న వార్తలపైనా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. పవిత్ర ఫిర్యాదుపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

చదవండి: కాంతారావుకు అమ్మాయిల పిచ్చి? స్పందించిన నటుడి కూతురు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top