బీడు భూమితో లాభాలు.. రైతులకు మాధవన్‌ చూపిన దారి | Actor R Madhavan Turned Waste Land Into Coconut Farm in Tamil Nadu | Sakshi
Sakshi News home page

బీడు భూమితో లాభాలు.. రైతులకు మాధవన్‌ చూపిన దారి

Apr 12 2026 9:06 AM | Updated on Apr 12 2026 10:25 AM

Actor R Madhavan Turned Waste Land Into Coconut Farm in Tamil Nadu

ఒకప్పుడు నిరుపయోగంగా, బీడుగా ఉన్న భూమి ఇప్పుడు  కొబ్బరి చెట్లతో పచ్చని తోటగా మారింది. నేల సారవంతాన్ని పునరుద్ధరించడం, పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తూ నటుడు మాధవన్ ఈ ప్రాజెక్టును తన వ్యక్తిగత అభిరుచిగా సుమారు ఆరేళ్ల క్రితం చేపట్టారు. ఓర్పు, ప్రణాళిక, సుస్థిర పద్ధతులతో నిరుపయోగంగా ఉన్న భూమిని ఎలా పునరుజ్జీవింపజేయవచ్చో ఆయన కృషి ప్రపంచానికి తెలియజేస్తుంది.

'ధురంధర్' చిత్రంలో  బలమైన పాత్రతో వెండితెరపై బహుముఖ నటనతో మెప్పించి ప్రశంసలు పొందిన నటుడు ఆర్. మాధవన్.. 2019 సమయంలో తమిళనాడులోని పళనిలో తన సోదరుడు శుభయోగ్యన్‌తో కలిసి కొబ్బరి సాగు ప్రారంభించారు. నిరూపయోగంగా ఉన్న బీడు భూమిని కౌలుకు తీసుకుని, కేవలం మూడేళ్లలోనే  విజయవంతంగా ఫలవంతమైన కొబ్బరి తోటగా మార్చారు. ఈ ఏడాది కొబ్బరికాయల దిగుబడి మరింత పెరగడంతో ఆదాయం కూడా వస్తుంది.  ఆయన నిరంతర కృషితో బీడు భూమి ఇప్పుడు కొబ్బరి చెట్లతో  ఫలవంతమైన తోటగా రూపాంతరం చెందింది. 

2020లో, ఆయన తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా మొదటిసారి ఈ విషయాన్ని వెల్లడించారు. చివరకు, తమిళనాడులోని పళనిలో కొబ్బరి సాగు ప్రాజెక్ట్ పూర్తయిందంటూ రైతులకు పలు సూచనలు ఇచ్చారు. నేల సారవంతాన్ని పునరుద్ధరించడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. బీడుగా ఉన్న భూమిలో హైబ్రిడ్ కాని, స్వచ్ఛమైన పొట్టి రకం కొబ్బరికాయలను పండించవచ్చని ఒక వ్యాసం ద్వారా రైతులకు సూచనలు ఇచ్చారు. రసాయన ఎరువులపై ఆధారపడకుండానే దిగుబడి పెంచుకోవచ్చని రుజువుతో చూపారు. మాధవన్‌ ముంబైల్నోఇ తన ఇంటి టెర్రస్‌పైన కూడా పలు చెట్లను పెంచుతున్నారు. చెర్రీస్‌, బొప్పాయ వంటి వాటితో ఆర్గానిక్‌ ఫలాలు పొందుతున్నారు. తన పడక గది పక్కనే కూరగాయలు పండుతున్నాయంటూ ఒక వీడియోను కూడా అభిమానులతో పంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement