నిర్మాతగా వస్తున్న కృష్ణుడు | Actor Krishnudu Turn As A Producer | Sakshi
Sakshi News home page

నిర్మాతగా వస్తున్న కృష్ణుడు

Aug 5 2020 5:02 PM | Updated on Aug 5 2020 5:50 PM

Actor Krishnudu Turn As A Producer - Sakshi

‘వినాయకుడు’,‘విలేజ్‌లో వినాయకుడు’ చిత్రాల కథానాయకుడు, ప్రముఖ నటుడు కృష్ణుడు నిర్మాతగా మారారు. కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్‌ అని ఆయన ఓ నిర్మాణ సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా ‘మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’ నిర్మించారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలో ప్రచార చిత్రాలు విడుదల చేయనున్నారు. (చదవండి : మరోసారి తమిళదర్శకుడితో మహేష్‌బాబు!)

ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ ‘నేటితరం యువత భావాలకు అద్దం పట్టేలా ‘మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ఉంటుంది. కొత్త కథ, కథనాలతో సినిమా తెరకెక్కించాం. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూశాక సంతృప్తిగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదించారు. నిర్మాతగా ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తా’అని అన్నారు. ఈ సినిమా ద్వారా లోతుగడ్డ జయరామ్ ను దర్శకుడిగా  తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement