
దివంగత ప్రముఖ దర్శక–నిర్మాత–స్క్రీన్ రైటర్ దాదాసాహెబ్ ఫాల్కే (Dada Saheb Phalke) జీవిత చరిత్ర వెండితెరపైకి రానుంది. ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ చేయనున్నారు. ఆమిర్ ఖాన్ (Aamir Khan)తో ‘త్రీ ఇడియట్స్, పీకే’ వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన రాజ్కుమార్ హిరాణి దర్శకత్వంలో ఈ దాదాసాహెబ్ బయోపిక్ రూపొందనుంది. తాజాగా ఈ సినిమా గురించి ఆమిర్ ఖాన్ మాట్లాడారు. ‘‘దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేయడం అనేది పెద్ద చాలెంజ్. వాణిజ్యపరమైన అంశాలున్న సాధారణ సినిమా కాదు ఇది. ఆ రోజుల్లోనే ఎవరూ ఊహించలేని విధంగా అడ్వెంచర్ చేసిన వ్యక్తి కథ ఇది.
అంత ఈజీ కాదు
ఆయన జీవితంలో ఎన్నో ఎగ్జైట్ చేసే అంశాలు, సంగతులు, సంఘటనలు ఉన్నాయి. అడ్వెంచర్ జర్నీలాంటి ఈ సినిమా చేయడం అంత సులభం కాదు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చేయడాన్ని నేను, రాజు (దర్శకుడు రాజ్కుమార్ హిరాణి కావొచ్చు) పెద్ద గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్లాన్ చేశాం’’ అని ఆమిర్ ఖాన్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం.
చదవండి: '21 లగ్జరీ కార్లు చూసి పడిపోయింది'.. తట్టుకోలేక ఏడ్చేసిన శుభశ్రీ