కబడ్డీలో మెదక్‌ జట్టు విజయం | - | Sakshi
Sakshi News home page

కబడ్డీలో మెదక్‌ జట్టు విజయం

Oct 19 2025 8:28 AM | Updated on Oct 19 2025 8:28 AM

కబడ్డీలో మెదక్‌ జట్టు విజయం

కబడ్డీలో మెదక్‌ జట్టు విజయం

ముగిసిన ఎస్‌జీఎఫ్‌ క్రీడలు

పటాన్‌చెరు: మూడు రోజులుగా పటాన్‌చెరులోని మైత్రి మైదానం వేదికగా నిర్వహించిన 69వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) రాష్ట్రస్థాయి క్రీడలు శనివారం ముగిశాయి. సాయంత్రం అండర్‌ 14 బాలుర కబడ్డీ ఫైనల్‌ మ్యాచ్‌లో నల్లగొండ జిల్లా జట్టుపై మెదక్‌ జట్టు ఘన విజయం సాధించింది. అండర్‌ 14 బాలికల కబడ్డీ ఫైనల్‌ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జిల్లా జట్టుపై ఖమ్మం జట్టు ఘన విజయం సాధించింది. అండర్‌ 17 బాలుర వాలీబాల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో వరంగల్‌ జిల్లా జట్టుపై ఖమ్మం జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. క్రీడలకు, క్రీడాకారులకు కేంద్రంగా పటాన్‌చెరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నామని.. రాబోయే రోజుల్లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఈసందర్భంగా వాలీబాల్‌ జాతీయ స్థాయి క్రీడాకారుడు కృష్ణం రాజుతోపాటు రిటైర్డ్‌ వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్‌ కబడ్డీ అసోసియేషన్‌ ప్రతినిధులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమష్టికృషితో రాష్ట్రస్థాయి క్రీడలను విజయవంతం చేశామన్నారు. జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కబడ్డీ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని వీరేశ్‌ మాట్లాడుతూ.. క్రీడల పట్ల ఆసక్తి కలిగిన ఎమ్మెల్యే లభించడం పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజల అదృష్టం అన్నారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయి కబడ్డీ జట్టులో తెలంగాణ క్రీడాకారుల ప్రాతినిధ్యం పెరగాలని ఆకాంక్షించారు. కబడ్డీ అసోసియేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి జగదీశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. కబడ్డీ క్రీడలో జాతీయస్థాయిలో మెదక్‌ జిల్లా క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించడం ప్రశంసనీయమన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గం నుండి కబడ్డీ క్రీడాకారులు సైతం జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక కావాలని అభిలాషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement