క్రీడలతో స్నేహభావం: డీఎం సురేఖ | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో స్నేహభావం: డీఎం సురేఖ

Oct 18 2025 9:53 AM | Updated on Oct 18 2025 9:53 AM

క్రీడలతో స్నేహభావం: డీఎం సురేఖ

క్రీడలతో స్నేహభావం: డీఎం సురేఖ

మెదక్‌ కలెక్టరేట్‌: మెదక్‌ జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం జిల్లాస్థాయి అండర్‌ 17, అండర్‌ 14 బాలికల ఖోఖో పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఎస్‌జిఎఫ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ జిల్లాస్థాయి పోటీల్లో 21 మండలాల నుంచి 420 మంది బాలికలు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆర్టీసీ డిపో మేనేజర్‌ సురేఖ హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలతో స్నేహభావం పెంపొందిచుకోవచ్చన్నారు. ఈ పోటీల్లో అండర్‌ 17 విభాగంలో హవేళిఘనాపూర్‌ జట్టు మొదటి బహుమతి, , పాపన్నపేట ద్వితీయ బహుమతి, రామాయంపేట తృతీయ బహుమతి అండర్‌–14విభాగంలో ఫస్ట్‌ ఫ్రైజ్‌ పాపన్నపేట, సెకండ్‌ ఫ్రైజ్‌ మెదక్‌, థర్డ్‌ఫ్రైజ్‌ చేగుంట జట్లు సాధించాయి. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ఈ పోటీల్లో గెలుపొందిన జట్లు ఈనెల చివరి వారంలో మెదక్‌లో జరిగే ఉమ్మడి మెదక్‌ జిల్లా ఖో ఖో పోటీలలో పాల్గొంటాయని తెలిపారు.

జిల్లాస్థాయి బాలికల

ఖోఖో పోటీలు ప్రారంభం

విజేతలకు బహుమతులు అందజేసిన

డీఎం సురేఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement