
గ్రామాల్లో యూపీ అధికారుల సందడి
నర్సాపూర్ రూరల్: మండలంలోని అవంచ, రెడ్డిపల్లి గ్రామాల్లో బుధవారం ఉత్తరప్రదేశ్కు చెందిన పంచాయతీ శాఖ అధికారులు, సర్పంచ్లు పర్యటించారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సీడీపీఏ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలన, అభివృద్ధి పనులపై అధ్యయనం చేశారు. గ్రామపంచాయతీలో జరుగుతున్న పారిశుద్ధ నిర్వహణ, తడి, పొడి చెత్త, నిధుల సమీకరణ, వాటర్ హార్వెస్టింగ్, నర్సరీలు, ఫారం ఫండ్, అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాలలు, స్వయం సహాయక సంఘాల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, అవంచ, రెడ్డిపల్లి గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు, రాజకీయ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ సంస్కతి సాంప్రదాయాలను తెలియజేసేందుకు బతుకమ్మ ఆటాపాటలు, ఆయా రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధులత, డీఎల్పీఓ సాయిబాబా, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓ అంజిరెడ్డి, ఏపీఎం సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.