
ఉద్యోగులపై నిర్లక్ష్య వైఖరి తగదు
టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు నరేందర్
మెదక్ కలెక్టరేట్: ఉద్యోగులపై నిర్లక్ష్య వైఖరి తగదని టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, కరువు భత్యం, నూతన పీఆర్సీ, ఆరోగ్య కార్డుల అమలుపై ప్రభుత్వం 18 నెలలుగా తాత్సారం చేస్తుందన్నారు. ఉద్యోగుల హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యోగుల పాత పెన్షన్ విధానం ప్రవేశపెట్టే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. చార్మినార్ జోన్ సాధనకు త్వరలో అన్ని వర్గాల ఉద్యోగులతో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సంఘపరంగా వృత్తిపరంగా పదోన్నతులు పొందిన సభ్యులను శాలువాతో సన్మానించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మీనికి రాజ్ కుమార్ పలు తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. అలాగే పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా కార్యదర్శిగా కాయితి సంతోష్ను నియమించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గాండ్ల అనురాధ, జిల్లా సహా అధ్యక్షుడు ఎండీ ఇక్బాల్ పాషా, కోశాధికారి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఫజులుద్దీన్, రఘునాథరావు, లీల, సంయుక్త కార్యదర్శులు శివాజీ, కిరణ్ కుమార్, రాధ, ఆర్గనైజింగ్ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, క్రీడల కార్యదర్శి గోపాల్, కార్యవర్గ సభ్యులు మరియా, సతీష్, సలావుద్దీన్, నర్సాపూర్ యూనిట్ అధ్యక్షుడు శేషాచారి, ఏడుపాయల వనదుర్గ యూనిట్ కార్యదర్శి ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శుల ఫోరం జిల్లా అధ్యక్షుడు జంగం నగేష్, ఇరిగేషన్ ఫోరం కార్యదర్శి శ్రీ హర్ష, హెచ్డబ్ల్యూఓ ఫోరం కార్యదర్శి శేఖర్, ఏఈఓ ఫోరం కార్యదర్శి రాజశేఖర్, మెడికల్ ఫోరం కార్యదర్శి మంజుల, ఉద్యోగులు పాల్గొన్నారు.