రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

Sep 18 2025 10:39 AM | Updated on Sep 18 2025 10:39 AM

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

పాపన్నపేట(మెదక్‌): మండల కేంద్రంలో బుధవారం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో 12మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేశారు. వీరంతా ఈ నెల 25న నిజామాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి రమేష్‌, ఉపాధ్యక్షుడు కుమార్‌, జాయింట్‌ సెక్రటరీ శ్రీకాంత్‌, రాజగౌడ్‌, శశికుమార్‌, కోశాధికారి రవి, మధు, ఆంజనేయులు, శ్రీను, రేణుక, లాజర్‌, గీత, మీనా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement