
సరికొత్త హంగులతో పోలీస్స్టేషన్
పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
కలెక్టర్ రాహుల్రాజ్
కొల్చారం(నర్సాపూర్): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంస్థాగత ప్రసవాలను పెంచేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషిచేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం మండలంలోని పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది, స్టాక్ రిజిస్టర్, మందుల నిల్వలు, ఓపీ రిజిస్టర్ను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే సాధారణ ప్రసవాలు, ఆరోగ్య మహిళా కార్యక్రమం గురించి ఆరా తీశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖచ్చితంగా డెలివరీల సంఖ్య పెంచాలన్నారు. రిస్క్ ఉన్న కేసులను జిల్లా, ఏరియా ఆస్పత్రులకు పంపాలని సూచించారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా చేపట్టాలన్నారు. జ్వర బాధితులకు టెస్ట్ల సంఖ్యను పెంచాలన్నారు. సీజనల్ వ్యాధులను అరికట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పండగ వాతావరణంలో నిర్వహించాలి
హవేళిఘణాపూర్(మెదక్): రైతునేస్తం కార్యక్రమాన్ని సోమవారం పండగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. ఆదివారం హవేళిఘణాపూర్ రైతు వేదికలో ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం రేవంత్రెడ్డి జిల్లాలోని 57 రైతు వేదికల్లో రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడుతారని తెలిపారు.
జిన్నారం(పటాన్చెరు): సీఎస్ఆర్ నిధులతో అత్యాధునిక వసతులతో మోడల్ పోలీస్స్టేషన్ నిర్మించడం అభినందనీయమని మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ అన్నారు. ఆదివారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో నూతన పోలీస్స్టేషన్ భవన నిర్మాణానికి ఎంపీ రఘునందన్రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, హెటిరో పరిశ్రమ ప్లాంట్ డైరెక్టర్ మోహన్రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఐజీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే అత్యాధునిక పోలీస్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హెటిరో పరిశ్రమ సహకారంతో రూ. 3.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, డీఎస్పీ ప్రభాకర్, సీఐ రవీందర్రెడ్డి, నరేష్, లాలునాయక్, కమిషనర్ మధుసూదన్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొలన్ బాల్రెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్రెడ్డి, నాయకులు చంద్రారెడ్డి, హన్మంత్రెడ్డి, ఆనంద్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఐజీ సత్యనారాయణ

సరికొత్త హంగులతో పోలీస్స్టేషన్