
కోలపల్లి టోల్ ప్లాజా వద్ద నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు
కోలపల్లి టోల్ ప్లాజా వద్ద తనిఖీలు
పెద్దశంకరంపేట (మెదక్): ఎలాంటి అనుమతి లేకుండా కార్లో తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలోని కోలపల్లి పాత టోల్ప్లాజా వద్ద గురువారం నిర్వహించిన తనిఖీలలో ఎలాంటి అనుమతులు లేకుండా కారులో తరలిస్తున్న రూ.3.70 లక్షలు పట్టుకున్నామని ఏఎస్ఐ విట్టల్ తెలిపారు. నాందేడ్ వైపు నుంచి హైదరాబాదు వెళుతున్న మహరాష్ట్రకు చెందిన వాహనం నుంచి ఆ నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన వెంట సిబ్బంది రఘునాథ్, రాములు ఉన్నారు.