ఆదిలాబాద్రూరల్: ఆదిలాబాద్రూరల్ మండలంలోని చాందా (టి)శివారులో 9వ శతాబ్దం నాటి తొలి జైన తీర్థంకరుడు రుషభనాథుని శిథిల శిల్పాన్ని తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు రొడ్డవార్ పృథ్విరాజ్ మంగళవారం గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో జైన మతానికి సంబంధించిన అనేక పురాతన విగ్రహాలు ఒక్కొక్కటిగా లభ్యం అవుతున్నాయన్నారు. ఇప్పటి కే ఇక్కడ 17వ తీర్థంకర కుంతనాథ, పార్శ్వనాథ వి గ్రహాలు లభించాయన్నారు. వీటితో పాటు జైన మ తానికి సంబంధించిన సుమారు 50 వరకు శిథిల వి గ్రహాలు లభించడం ప్రత్యేకమన్నారు. ఆయన వెంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అక్షయ, షె రిల్, సాయిరాజ్ కాంబ్లే, శ్రేయ, మమత ఉన్నారు.
రుషభనాథుని శిథిల శిల్పం


