జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కన్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాల సంఖ్య ఎక్కువగా ఉంది. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం జరిగే వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేస్తుండగా హైరిస్క్ కేసులు మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వస్తున్నాయి. సాధారణ ప్రసవం కాని పక్షంలోనే సిజేరియన్ చేస్తున్నారు. ప్రైవేటులో జరిగే ప్రసవాలపై సమీక్ష నిర్వహించి, సిజేరియన్లను చేయడంపై ఎప్పటికప్పుడు రిపోర్టు తీసుకుని విచారణ చేస్తున్నాం. సాధారణ ప్రసవాలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
– డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి


