విద్యార్థుల నమోదు లక్ష్యసాధనలో జిల్లా రాష్ట్రంలోనే ప్రఽథమస్థానం సాధించింది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల విశ్వాసానికి ఇది నిదర్శనం. మౌలిక వసతుల కల్పన, అత్యున్నత అర్హతలు కలిగిన ఉపాధ్యాయులతో డిజిటల్ బోధన జరుగుతోంది. 8 అకాడమిక్ పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.
– కుమార్దీపక్, జిల్లా కలెక్టర్
నాణ్యమైన విద్య
ఇంటిరాక్టివ్ ప్లాట్ ప్యానెల్, ఐసీటీ కంప్యూటర్ ల్యాబ్, ల్యాప్టాప్లు, ట్యాబ్ల ద్వారా డిజిటల్ బోధన అందించారు. పాఠశాలల్లో డ్రాప్ అవుట్లు తగ్గించేందుకు 5,7,8 తరగతులు పూర్తి చేసిన విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలల్లో, పదో తరగతి పూర్తి చేసిన బాలికలను కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో చేర్పించేలా ఆదేశాలు ఇచ్చాం.
– చంద్రయ్య, అదనపు కలెక్టర్, డీఈవో


