సింగరేణి కార్మిక సంఘాలు ఐక్యం కావాలి | - | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మిక సంఘాలు ఐక్యం కావాలి

Jul 23 2026 1:30 AM | Updated on Jul 23 2026 1:30 AM

బెల్లంపల్లి: సింగరేణి మనుగడకు విభేదాలు పక్కనపెట్టి కార్మిక సంఘాలన్ని ఐక్యం కావాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వెంకటస్వామి అన్నారు. ఈ నెల 17, 18న మెడికల్‌ బోర్డులో కార్మికులకు జరిగిన అన్యాయానికి నిరసనగా బుధవారం శాంతిఖని గనిపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేనంతగా కార్మికుల శ్రమ శక్తిని దోచుకుంటున్నారని విమర్శించారు. ఇటీవల మెడికల్‌ బోర్డులో 24 మందిని మాత్రమే మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ చేసి మెజార్టీ కార్మికులకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ బ్రాంచి ప్రచార కార్యదర్శి మంతెన రమేష్‌, ఫిట్‌ సెక్రెటరీ రత్నం ప్రవీణ్‌, అసిస్టెంట్‌ సెక్రెటరీ దాడి రమేష్‌, సీనియర్‌ నాయకులు రత్నం ఐలయ్య, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement