కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య

Jul 22 2026 11:29 AM | Updated on Jul 22 2026 11:29 AM

నస్పూర్‌: కుటుంబ కలహాల కారణంగా భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘట న నస్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్ర శాంత్‌నగర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం... ప్రశాంత్‌నగర్‌కు చెందిన కుచాడి సతీష్‌(48) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో సూపర్‌వైజర్‌గా పని చేసేవాడు. భార్య విజయ, కూతు రు సంజనితో కలిసి అక్కడే ఉండేవాడు. సతీష్‌ తండ్రి శేఖర్‌ గత మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో సతీష్‌ కుటుంబం ఇంటివద్దకే వచ్చి తల్లి తులసితో కలిసి ఉంటున్నారు. సతీష్‌, విజయ మధ్య నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు నెలలుగా గొడవలు జరగడంతో జీవితంపై విరక్తి చెందాడు. మంగళవారం వేకువజామున సతీష్‌ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement