బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు సదస్సులో కాళేశ్వరం ప్రాజెక్టుపై అవగాహన రైతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ
లక్సెట్టిపేట: నలుగురు రైతులు మృతిచెందినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, సహాయం అందించలేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు విమర్శించారు. మండలంలోని అంకతిపల్లి గ్రామ సమీపంలో ఉన్న వాసవి ఫంక్షన్హాల్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత మే నెలలో గోడ కూలి మృతిచెందిన నాగరాజు, అభిరామ్, వెంకటేష్, లచ్చన్న కుటుంబాలకు పార్టీ ఆధ్వర్యంలో రూ.5లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. కాశేళ్వరం ప్రాజెక్టు, నీటి ప్రవాహంపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రైతులకు వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో రైతులను అభివృద్ధి చేశామని అన్నారు.
గూడెంలో పూజలు..
దండేపల్లి: మండలంలోని గూడెం సత్యనారాయణస్వామిని కేటీఆర్ మంగళవారం దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి లక్సెట్టిపేటలో జరిగే రైతు సదస్సుకు వెళ్తున్న ఆయన గూడెం గుట్టపైకి వెళ్లారు. సత్యనారాయణస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు ఆశ్వీరచనం చేయగా, ఈవో శ్రీనివాస్ లడ్డు ప్రసాదం, స్వామివారి చిత్రపటం అందించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, సుమన్, నాయకుడు విజిత్రావు పాల్గొన్నారు.


