మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూసమస్యలు పరిష్కరించాలని, ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీ పనుల బిల్లులు ఇప్పించాలని, పింఛన్లు మంజూరు చేయాలని దరఖాస్తులు అందజేశారు. అధికారులు సమన్వయంతో దరఖాస్తులు పరిష్కరించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
బస్తాకు మూడు కిలోల కోత
జైపూర్ మండలంలో ని ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తా కు మూడు కిలోల కోత విధిస్తూ తూకం వేస్తున్నా రు. దీంతో క్వింటాల్కు 8 కిలోల వరకు నష్టపోతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా కోతలు పెడుతూ రైతులను ముంచుతున్న వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి.
– రైతులు, గ్రామం: కిష్టంపేట, మం: జైపూర్


