పాతమంచిర్యాల: అమ్మ ప్రేమ అమృతం కన్నా గొప్పదని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి వి.మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆనంద నిలయం వృద్ధాశ్రమంలో మదర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులను సన్మానించి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన వారిని శాలువాలతో సత్కరించి మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ వైస్చైర్మన్ సల్ల రమ్య, మాతృమూర్తులు జ్యోత్స్న చంద్రదత్, మణిమాల, మంజుల కృష్ణారావు, సుమన చైతన్య, మంచిర్యాల మహిళా తరంగిణి అధ్యక్షురాలు చంద్రకళ, లీల, సరిత ఓజా, ఆశ్రమ నిర్వాహకులు సుధారెడ్డి, లయన్స్క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.


