భవిష్యత్లో ఐఐటీ పూర్తి చేసి.. సివిల్స్ సాధించడం, సమాజానికి చేయాలన్నదే లక్ష్యమని అమన్ అమృత తెలిపాడు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధించానని పేర్కొన్నాడు. మంచిర్యాలలోని శ్రీచైతన్య పాఠశాలలో చదివాడు. కాగా, తండ్రి కిషోర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి హరిత గృహిణి. జిల్లాలో అత్యధిక మార్కులు సాధించిన అమన్ అమృతను పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, ఏజీఎం అరవిందరెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజ్, ప్రధానోపాధ్యాయుడు సంజీవ్ అభినందించారు.


