బాసరలో భక్తుల రద్దీ
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు అనంతరం అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లో బారులు తీరారు. తర్వాత అమ్మవారిని దర్శంచుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అర్చకులతో అక్షరాభ్యాసం చేయించారు. మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఈవో అంజనదేవి, ఏఈవో గంగ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని ఈవో అంజనాదేవి తెలిపారు. కాగా, అర్జితసేవ టికెట్లు, ప్రత్యేక అక్షరాభ్యాసం, చండీహోమం, అభిషేక లడ్డూ మహా ప్రసాదం, పులిహోరా మండపప్రవేశం, అష్టోత్తర కుంకుమార్చన ద్వారా ఆలయానికి రూ.14.40 లక్షల ఆదాయం సమకూరింది.
బాసరలో భక్తుల రద్దీ
బాసరలో భక్తుల రద్దీ


