వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్టు
మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో ఇటీవల వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. పోలీసుస్టేషన్లో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. రాజీవ్నగర్కు చెందిన గుమ్మడి సారయ్య ఈనెల 19న హమాలివాడ హనుమాన్ ఆలయం, 20న పెద్దమ్మ ఆలయంలో చోరీ చేసి రూ.8 వేల నగదు ఎత్తుకెళ్లాడు. గతేడాది ఎంసీసీలోని పోస్టాఫీసులో జరిగిన చోరీలో రెండు మానిటర్లు, జనరేట్లు, కీ బోర్డులు దొంగలించాడు. ఈ మేరకు సారయ్యను శనివారం పోలీసులు అరెస్టు చేసి అతని నుంచి రెండు మానిటర్లు, కీబోర్డును స్వాధీనం చేసుకున్నారు.


