పట్టపగలే చోరీ
భీమారం: మండలంలోని నర్సింగాపూర్ గ్రా మంలో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. గుంటి సత్యనారాయణ కుటుంబసభ్యులతో కలిసి అదే గ్రామంలో జరిగిన వివాహ వేడుకలకు వెళ్లారు. మధ్యాహ్నం వచ్చి చూసేసరికి ఇంటికి వేసిన తాళం తీసి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో 6 తులాల బంగారం, 8 తులాల వెండి, రూ.30 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. వెంటనే పోలీసులకు స మాచారం అందించారు. ఎస్సై రాజేందర్ ఘ టన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీంని రప్పించి ఆధారాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


