రాష్ట్రస్థాయి పోటీలకు ఆర్జీయూకేటీ విద్యార్థులు
బాసర: మెదక్ జిల్లా నర్సాపూర్లో బీవీ రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 8 వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ‘విష్ణు నేషనల్ కాంక్రీట్ కానో కాంపిటీషన్’లో బాసర ఆర్జీయూకేటీ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొంటున్నారు. ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ శ్రీ వాహిద్ పర్యవేక్షణలో విద్యార్థులు పోటీకి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఈ మురళీదర్శన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఖలీల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధ్యాపకులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.


