దరఖాస్తులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులు పరిష్కరించాలి

Jan 6 2026 2:01 PM | Updated on Jan 6 2026 2:01 PM

దరఖాస్తులు పరిష్కరించాలి

దరఖాస్తులు పరిష్కరించాలి

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ● ప్రజావాణిలో అర్జీల స్వీకరణ ● ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని బెల్లంపల్లికి చెందిన బాల కవిత, మంచిర్యాల పట్టణంలోని పాత గర్మిళ్లకు చెందిన అందే లక్ష్మి, పింఛన్‌ ఇప్పించాలని మంచిర్యాలకు చెందిన శాంతమ్మ కోరారు. ● లక్సెట్టిపేట మండలం ఉత్కూర్‌ చౌరస్తా శివారులో భూమిని కొందరు అక్రమంగా తీసుకున్నారని, విచారణ జరిపి న్యాయం చేయాలని మంచిర్యాల నగరం రాంనగర్‌కు చెందిన కోమాకుల పోచమ్మ ఫిర్యాదు చేశారు. ● మంచిర్యాలలోని 29వ డివిజన్‌లో విద్యుత్‌ దీపాలు, ఓపెన్‌ జిమ్‌ పరికరాలు మరమ్మతు చేయాలని, గ్రీన్‌ మ్యాట్‌ ఏర్పాటు, మూత్రశాలల సౌకర్యం కల్పించాలని హైటెక్‌సిటీ వాకర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు దరఖాస్తు అందజేశారు.

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ పి.చంద్రయ్య, డిప్యూటీ ట్రెయినీ కలెక్టర్‌ మహమ్మద్‌ విలాయత్‌ అలీతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

లైబ్రరీ ఏర్పాటు చేయాలి

నస్పూర్‌: నస్పూర్‌ మండల పరిధిలో లైబ్రరీ ఏర్పాటు చేయాలని నిరుద్యోగులు దుర్గం రఘు, మేడ వంశీకృష్ణ, కట్ల శ్రీనివాస్‌, శ్రీరాంపూర్‌, నస్పూర్‌ మండలాల యువకులు కలెక్టర్‌ను కోరారు. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడుతుంటారని, లైబ్రరీ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement