రౌండ్‌ టేబుల్‌ సమావేశం విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

రౌండ్‌ టేబుల్‌ సమావేశం విజయవంతం చేయాలి

Dec 11 2025 7:26 AM | Updated on Dec 11 2025 7:26 AM

రౌండ్‌ టేబుల్‌ సమావేశం విజయవంతం చేయాలి

రౌండ్‌ టేబుల్‌ సమావేశం విజయవంతం చేయాలి

పాతమంచిర్యాల: సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 28న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సింగరేణి పరిరక్షణ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఐక్యవేదిక వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఐ.కృష్ణ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మార్క్స్‌భవన్‌లో కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో కొత్త గనులు ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సింగరేణి పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు ఉద్యమానికి కలిసి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో హెఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌, ఐఎఫ్‌టీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్‌, టీఎస్‌యూఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నీరటి రాజన్న, ఏఐఎఫ్‌టీయూ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మేకల పోషమల్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement