అనధికార పొత్తులు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పంచాయతీ ఎన్నికల్లో పదవుల కోసం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న పార్టీ కార్యకర్తలను నాయకులు పక్కన పెడుతున్నారు. ఇ న్నాళ్లుగా ఉన్న రాజకీయ వైరుధ్యాలను మరిచి ప్ర జాప్రతినిధులుగా గెలిచేందుకు సిద్ధపడుతున్నారు. కొన్నిచోట్ల నువ్వా.. నేనా? అన్నట్లుగా కొట్లాడుతుండగా, మరికొన్ని చోట్ల మధ్యే మార్గంగా రాజీ పడు తూ ముందుకు సాగుతున్నారు. ప్రధాన పార్టీలు బ లపరిచిన అభ్యర్థులు జెండాలను పక్కకు పెట్టి త మ ఎజెండాను అమలు చేస్తున్నారు. పార్టీ అధిష్టా నం నుంచి ఒప్పుకోకున్నా, అనధికార పొత్తులతో ఎత్తులు వేస్తున్నారు. మండల, జిల్లా పరిషత్, ము న్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో నిర్వహిస్తారు. ఇందుకు పార్టీ నుంచి ‘బీ ఫాం’ తప్పనిస రి. అయితే పంచాయతీ ఎన్నికలు ఇందుకు భిన్నం. రాజకీయ పార్టీల గుర్తులుండవు. బరిలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తులే కేటా యిస్తారు. దీంతో పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత పలుకుబడితో ప్రతిపక్ష నాయకులు సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు పంచుకుంటున్నారు. ఇ ప్పటివరకు జిల్లాలో ఆరుగురు సర్పంచులు, 268 మంది వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏకగ్రీవాల వెనుక భారీ తతంగం జరుగుతోంది.
జెండాలు లేవు.. ఎజెండాలే
జిల్లాలో తొలి విడత ఎన్నికల్లో ఇప్పటికే పలు చోట్ల ఏకగ్రీవాల కోసం ఆయా పార్టీల నాయకులు కలిసి పదవులు పంచుకున్నారు. రెండు, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో ఇప్పటికే ఏకగ్రీవాల కోసం సంప్రదింపులు నడస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ కోసం పలు విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రతిపక్షాలకు దెబ్బ
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వస్తుండగా, బీఆర్ఎస్, బీజేపీ, వామపక్ష పార్టీల అభ్యర్థులకు ఇబ్బందులు వస్తున్నాయి. సర్పంచ్ పదవులు అధికంగా అధికార పార్టీకి దక్కుతుండగా ప్రతిపక్ష పార్టీలు రాజీ పడాల్సి వస్తోంది. పంచాయతీల్లో అధికంగా పలుకుడి ఉన్న నాయకులు ఆయా చోట్ల పోటీ లేకుండా ఉండేందుకు పార్టీలను పక్కకు పెట్టి ముందుకు సాగుతున్నారు. మరోవైపు సర్పంచులుగా గెలిచాక ఆయా అభ్యర్థులకు పార్టీ జెండా కప్పి తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


