అందరికీ ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యం. ఆదాయానికి మించి అప్పులు చేయొద్దనే ప్రాథమిక సూత్రాన్ని మరవొద్దు. ఆన్లైన్ యాప్లు, బెట్టింగ్లకు దూరంగా ఉండాలి. ఏ వ్యాపారమైతే చేయదలుచుకున్నారో దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. పెట్టుబడులకు రుణాలు చేసే ముందు కుటుంబసభ్యులతో ఆర్థిక విషయాలు చర్చించాలి. ఆర్థిక సమస్యలతో మానసిక ఒత్తిడి పెరిగితే కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకోవాలి. అప్పులు జీవితంలో ఒక స మస్య మాత్రమే. అది జీవితానికి ముగింపు కాదు. అవసరమైన పక్షంలో కౌన్సెలింగ్ తీసుకోవాలి.
– డాక్టర్ అనిల్రాజ్, మానసిక వైద్య నిపుణుడు, జిల్లా జనరల్ ఆస్పత్రి
●


