చోరీల కట్టడికి గస్తీలు | - | Sakshi
Sakshi News home page

చోరీల కట్టడికి గస్తీలు

Sep 28 2025 8:38 AM | Updated on Sep 28 2025 8:38 AM

చోరీల

చోరీల కట్టడికి గస్తీలు

రాత్రివేళ పెట్రోలింగ్‌, బ్లూకోర్ట్స్‌ వాహనాలు తిరిగేలా చర్యలు

జిల్లాకేంద్రంలో 250 ఎన్‌పీఆర్‌, 110 వైర్‌లెస్‌ కెమెరాల ఏర్పాటు

ప్రయాణాలు చేసేవారు విలువైన వస్తువులు మెడలో వేసుకోరాదు

ఇళ్లకు తాళం వేసే దాంట్లో కూడా జాగ్రత్తలు అవసరం

‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు

మహబూబ్‌నగర్‌ క్రైం: దసరా పండగ నేపథ్యంలో ప్రతిఒక్కరూ స్వగ్రామాలు, ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఇంట్లో విలువైన వస్తువులు చోరీ కాకుండా, ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో చేపట్టిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు పలువురు అడిగిన అనుమానాలను నివృత్తి చేశారు. వివరాలిలా..

ప్రశ్న: మహబూబ్‌నగర్‌ బైపాస్‌, ఏనుగొండ మార్గాల్లో రాత్రివేళ ఓపెన్‌ డ్రికింగ్‌ ఉంటుంది. దీంతో ఏనుగొండ నుంచి బైపాస్‌, హౌసింగ్‌ బో ర్డు, ఎదిర రోడ్డు మార్గాల్లో మహిళలు వెళ్లడం కష్టంగా ఉంది. – కల్యాణి, హౌసింగ్‌ బోర్డు

డీఎస్పీ: ఏనుగొండ నుంచి బైపాస్‌, ఎదిర రోడ్డు మార్గాల్లో రాత్రివేళ పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇకపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి గస్తీ పెంచి ఆరుబయట మద్యం తాగకుండా చర్యలు తీసుకుంటాం.

చోరీల కట్టడికి గస్తీలు 1
1/1

చోరీల కట్టడికి గస్తీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement