
ఓ పక్క రుక్మిణి..మరో పక్క సత్యభామ.. మురళీలోలుడు బకాసురుడిని వధిస్తూ భక్తులకు కనువిందు చేశారు.

సర్వభూపాలుడిని అధిరోహించిన స్వామి సకల భూపాలురకు తానే అధిపతినని.. తన భిక్షే రాజ్యాధికారమని సందేశమిచ్చారు.

అంతకుముందు కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంపై రాజమన్నార్ అవతారంలో వచ్చి భక్తులకు అభయమిచ్చారు.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శనివారం కల్పవృక్ష. సర్వభూపాల వాహనసేవలు నిర్వహించారు.

తిరుమాడ వీధుల్లో భక్తులు మలయప్పను దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు.

వాహనసేవల ముందు కళాప్రదర్శనలు భక్తులను ఆకట్టుకున్నాయి.













